Saturday 1 February 2014

మటన్‌ బిర్యానీ

కావలసిన వస్తువులు
బియ్యం - 1కిలో, మటన్‌ - 1కిలో, పెరుగు - పావులీటర్‌, డాల్డా - 150గ్రా||, నిమ్మకాయలు - 2, పచ్చిమిర్చి - 10, కారం - 1స్పూను,
ఉప్పు -తగినంత, కొత్తిమీర - 1కట్ట, పుదీనా - 1కట్ట, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 3 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిగడ్డలు - పావుకిలో (4పెద్దవి), లవంగాలు - 6, యాలకులు - 4, దాల్చిన చెక్క - కొంచెం, షాజీర - టీ స్పూను
తయారు చేసే విధానం
డాల్డాలో ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించి విడిగా పెట్టుకోవాలి. మటన్‌ కడిగి పెద్ద గిన్నెలో వేసి దానికి పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, వేయించిన ఉల్లిగడ్డముక్కలు సగం, ఉప్పు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, 1 నిమ్మకాయ రసం, పెరుగు, లవంగాలు, యాలుకలు, దాల్చిన చెక్క, షాజీర, డాల్డా కూడా కొంచెం కలిపి ఒక గంట అలాగే వుంచాలి. తర్వాత బియ్యం సగం ఉడికాక (అంటే అన్నం పలుకుగా వుండాలి) నీళ్లు మొత్తం వొంపేయాలి. ఆ బియ్యాన్ని దినుసులన్నీ కలిపి వుంచిన మటన్‌ పైన వేయాలి. మిగిలిన డాల్డా, కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకులు, వేపిన ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ రసం కూడా బియ్యం పైన వేసి పది నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత సన్న సెగ మీద మరో పదినిమిషాలు ఉంచితే చాలు. ఉడికేటప్పుడు ఆవిరి పోకుండా చూసుకోవాలి. అంతే ఘుమఘుమలాడే మటన్‌ బిర్యానీ రెడీ. తినేముందు మటన్‌ అన్నం మొత్తం కలిసేలా కలియదిప్పాలి.

No comments:

Post a Comment